Skip to main content

T20 Cricket: స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధన

ICC-Ground

అంతర్జాతీయ టి20 టోర్నిల్లో నిర్ణీత సమయంకంటే ఓవర్లు ఆలస్యం చేస్తే చివరి ఓవర్లో 30 గజాల సర్కిల్‌ వెలుపల ఒక ఫీల్డర్‌ను తగ్గించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 7న ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఒక టి20 మ్యాచ్‌లో 85 నిమిషాల్లో 20 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ‘85వ నిమిషంలో 20వ ఓవర్‌ మొదలు కావాలి’ అనేది తాజా నిబంధన. అలా చేస్తేనే సరైన ఓవర్‌రేట్‌ నమోదు చేసినట్లుగా భావిస్తారు. లేదంటే ఫీల్డర్‌ కోత పడుతుంది. టి20ల్లో స్లో ఓవర్‌రేట్‌కు చెక్‌ పెట్టేందుకు ఐసీసీ తాజా నిర్ణయం దోహదం చేయనుంది. టి20 ఇన్నింగ్స్‌ మధ్యలో (10 ఓవర్ల తర్వాత) రెండున్నర నిమిషాల డ్రింక్స్‌ బ్రేక్‌ తీసుకోవచ్చనేది మరో కొత్త నిబంధన.

రవి దహియా ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

కరోనా కాలంలో విదేశీ కోచ్‌ల వెంట పడకుండా... 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు భారతీయ కోచ్‌ల ఆధ్వర్యంలో తమ ప్రదర్శ నకు మెరుగులు దిద్దుకోవాలని భారత స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, రవి దహియా నిర్ణయం తీసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌–2020లో రవి రజతం... బజరంగ్‌ కాంస్యం సాధించారు.

చ‌ద‌వండి: చక్దా సినిమాను ఎవరి జీవిత విశేషాలతో రూపొందించనున్నారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 08 Jan 2022 04:32PM

Photo Stories