Skip to main content

Aditya Mittal: భారత చెస్‌ 77వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య

ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆదిత్య మిట్టల్‌ భారత చెస్‌లో 77వ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా అవతరించాడు.

స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రెగట్ టోర్నీలో ఆరో రౌండ్‌లో ఫ్రాన్సిస్కో (స్పెయిన్‌)పై ఆదిత్య గెలిచి జీఎం నార్మ్‌ ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు. జీఎం కావాలంటే ఓ చెస్‌ ప్లేయర్‌ మూడు జీఎం నార్మ్‌లతోపాటు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లను సాధించాలి. ఆదిత్య 2021లో తొలి జీఎం నార్మ్, 2022లో మిగతా రెండు జీఎం నార్మ్‌లు సంపాదించాడు.   

Tata Steel India 2022 Rapid Tourney: రన్నరప్‌ అర్జున్‌.. హారికకు మూడో స్థానం

Published date : 07 Dec 2022 03:08PM

Photo Stories