Skip to main content

National Games: జాతీయ క్రీడల్లో రెండో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌!

భారత స్టార్‌ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో మరోసారి ‘పసిడి’ ప్రదర్శనతో అదరగొట్టింది.
Jyothi Yarraji wins gold in women's 200m

ఫిబ్ర‌వ‌రి 11వ తేదీ జరిగిన మహిళల అథ్లెటిక్స్‌ 200 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 200 మీటర్ల ఫైనల్‌ రేసును జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 23.35 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. 

తెలంగాణ అమ్మాయి నిత్య (23.76 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇటీవ‌ల‌ జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌లో వరుసగా మూడోసారి జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది.
జిమ్నాస్టిక్స్‌లో భాగమైన మహిళల ట్రాంపోలిన్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ యాసీన్‌ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 2022 గుజరాత్‌ జాతీయ క్రీడల్లో యాసీన్‌ రజతం నెగ్గింది.    

National Games 2025: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో చేరిన‌ ఐదో స్వర్ణ పతకం
  
నందిని నిలకడగా.. 
ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్‌ (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్‌ త్రో, 800 మీటర్లు) ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి అగసార నందిని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.  
 
అంతేకాకుండా ఈ ఏడాది మే 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించింది. మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఆల్‌ అరౌండ్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్‌ (44.767 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. 

మరోవైపు మహిళల నెట్‌బాల్‌ ఫాస్ట్‌–5 ఈవెంట్‌లో తెలంగాణ జట్టుకు రజత పతకం లభించింది. 

ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్‌ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 17వ స్థానంలో.. తెలంగాణ 14పతకాలతో (2 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యాలు) 27వ స్థానంలో ఉన్నాయి.

Karnataka Swimmers: జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లకు.. చెరో తొమ్మిది పసిడి పతకాలు

Published date : 13 Feb 2025 10:19AM

Photo Stories