Skip to main content

5G Technology: దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్‌ అభివృద్ధి చేసిన సంస్థ?

5G Technology

దేశంలో 5జీ సాంకేతికత పరిశోధనలో కీలక ముందడుగు పడింది. తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 5జీ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీని వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ (డబ్ల్యూఐఎస్‌ఐజీ) అనే స్టార్టప్‌ కంపెనీతో కలసి ఐఐటీ హైదరాబాద్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఒరాన్‌ (ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌) టెక్నాలజీ సాయంతో తొలి డేటా కాల్‌ను చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 22న ప్రకటన విడుదల చేసింది. 3.3–3.5 జీహెచ్‌జెడ్‌ (గిగాహెర్ట్‌జ్‌) ఫ్రీక్వెన్సీ (పౌనఃపున్యం) బ్యాండ్‌లో 100 ఎంహెచ్‌జెడ్‌ (మెగా హెర్ట్‌జ్‌) బ్యాండ్‌విడ్త్‌కు సపోర్ట్‌ చేసే మల్టిపుల్‌ ఇన్‌పుట్‌–మల్టిపుల్‌ అవుట్‌పుట్‌ (మిమో) సామర్థ్యంగల బేస్‌స్టేషన్‌ను ఉపయోగించి డేటా కాల్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. 5జీ స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టమని పేర్కొన్నాయి.

చ‌ద‌వండి: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీ పేరు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఒరాన్‌ (ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌) టెక్నాలజీ సాయంతో తొలి డేటా కాల్‌ను చేసిన సంస్థలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు    : వెసిగ్‌ నెట్‌వర్క్స్‌ (డబ్ల్యూఐఎస్‌ఐజీ), ఐఐటీ హైదరాబాద్‌ 
ఎందుకు : 5జీ సాంకేతిక అభివృద్ధిలో ప్రక్రియలో భాగంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 24 Feb 2022 03:48PM

Photo Stories