P17A ‘దునగిరి’ యుద్ధనౌక జాతికి అంకితం
Sakshi Education
![Dunagiri- Project 17A Frigate to be launched on Friday](/sites/default/files/images/2022/07/16/dunagiri-1657972735.jpg)
ఆధునిక యుద్ధనౌక P 17 A INS ‘దునగిరి’ ని కోల్ కతాలోని హుగ్లీ నది వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జూలై 15న ప్రారంభించారు. కోల్ కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. ప్రాజెక్ట్ 17A కింద రూపొందిస్తోన్న యుద్ధ నౌకల్లో ఇది నాలుగోది. మొదటిదైనా ఐఎన్ఎస్ నీలగిరిని 2019, రెండోదైన ఐఎన్ఎస్ హిమగిరిని 2020లో ప్రారంభించారు. మూడోదైన ఐఎన్ఎస్ ఉదయగిరి 2022 మే నెలలో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు కింద అన్ని యుద్ధ నౌకలను పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు.
Also read: Most Powerful Missiles: హైపర్ సోనిక్ మిసైల్ కింజల్ పరిధి ఎన్ని కిలోమీటర్లు?
Published date : 16 Jul 2022 05:28PM