Skip to main content

DRDO: ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం

Akash Prime

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించిన ఆకాశ్‌ క్షిపణిలోని కొత్త వెర్షన్‌ ‘ఆకాశ్‌ ప్రైమ్‌’ను భారత్‌ సెప్టెంబర్‌ 27న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లాలో ఉన్న చండీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి మొదటిసారిగా ప్రయోగించిన ‘ఆకాశ్‌ ప్రైమ్‌’ క్షిపణి.. ఆకాశంలోని లక్ష్యాన్ని ఛేదించిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. ప్రయోగంలో డీఆర్‌డీవో, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం డీఆర్‌డీవో చైర్మన్‌గా జి.సతీశ్‌ రెడ్డి ఉన్నారు.

ఆకాశ్‌ ప్రైమ్‌ విశేషాలు...

  • ప్రస్తుతమున్న ఆకాశ్‌ క్షిపణితో పోలిస్తే.. ‘ప్రైమ్‌’ వెర్షన్‌లో దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్‌ ఆర్‌ఎఫ్‌ సీకర్‌ ఉంది. దీంతో లక్ష్యాన్ని మరింత కచ్చితత్వంతో తుత్తునియలు చేయవచ్చు.  
  • భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఆకాశ్‌ ప్రైమ్‌.. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మరింత ఎత్తయిన ప్రదేశాల్లోని లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది.

చ‌ద‌వండి: సీ–295 విమానాల కొనుగోలుకు భారత్‌ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ    : చండీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్, బాలాసోర్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రం 
ఎందుకు  : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు...
 

Published date : 28 Sep 2021 12:59PM

Photo Stories