Skip to main content

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నేషనల్‌ లా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది?

National Law University

కర్నూలు జిల్లా, కర్నూలు నగర సమీపంలోని జగన్నాథ గట్టుపై 50 ఎకరాల్లో రూ.88.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాల, క్లస్టర్‌ విశ్వవిద్యాలయం పరిపాలన భవన సముదాయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఫిబ్రవరి 10న భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. జగన్నాథ గట్టులో ‘‘నేషనల్‌ లా యూనివర్సిటీ’’ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. స్టేట్‌ ఆర్కిటెక్ట్‌ బోర్డు ద్వారా క్లస్టర్‌ వర్సిటీ భవనాలను అత్యంత నాణ్యంగా నిర్మిస్తున్నట్టు చెప్పారు.

చ‌ద‌వండి: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
త్వరలో నేషనల్‌ లా యూనివర్సిటీ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
ఎక్కడ : జగన్నాథ గట్టు, కర్నూలు నగర సమీపం, కర్నూలు జిల్లా

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Feb 2022 03:57PM

Photo Stories