Skip to main content

Amrit Bharat Station Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లకు మహర్దశ

ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్‌ కో­సం గుర్తించినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.
Amrit-Bharat-Station-Scheme
Amrit Bharat Station Scheme

2023–24లో జూన్‌ 2023 వరకు దక్షిణ మధ్య రైల్వేలో అభివృద్ధి నిమిత్తం రూ.83.64  కోట్లు వ్యయం చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు.   
ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో 53 రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు.

☛☛ waterways on rivers for transportation: కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా

రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న రైల్వే స్టేషన్లు ఇవే.. 

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, విజయనగరం, తెనాలి, గుంటూరు, ఆదోని, అనకాపల్లి, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కడప, కంభం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, యలమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గూడురు, గుణదల, హిందూపూర్, ఇచ్ఛాపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస, కుప్పం, కర్నూలు సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి రోడ్, మంగళగిరి, మార్కాపూరం రోడ్, మంత్రాలయం రోడ్, నడికుడి, నంద్యాల, నరసరావు­పేట, నరసాపూర్, నౌపడ, నెల్లూరు, నిడద­వోలు, ఒంగోలు, పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజంపేట, రాజమహేంద్రవరం, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సూళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తుని, వినుకొండ.  

☛☛ Sagar Mala Projects in AP: ఏపీలో లక్షా 20 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌లు

Published date : 03 Aug 2023 03:45PM

Photo Stories