Skip to main content

Sansad TV: సంసద్‌ టీవీ హోస్ట్‌లుగా వ్యవహరించనున్న ప్రతిపక్ష ఎంపీలు?

Sansad TV Hosts

లోక్‌సభ, రాజ్యసభల టీవీలను కలిపేస్తూ కొత్తగా వచ్చిన సంసద్‌ టీవీలో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా దర్శనమివ్వబోతున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ‘టు ది పాయింట్‌’ అనే కార్యక్రమాన్ని హోస్ట్‌ చేయబోతుండగా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థరూర్‌ నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులతో వివిధ అంశాలపై లోతైన చర్చలు  ఉంటే, చతుర్వేది మహిళా ఎంపీల రాజకీయ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

హైపరైస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోహ్లి...

వెల్‌నెస్‌ సంస్థ హైపరైస్‌తో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చేతులు కలిపారు. కంపెనీలో అథ్లెట్‌–ఇన్వెస్టర్‌గా ఉండటంతో పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు. తద్వారా అంతర్జాతీయ అథ్లెట్‌ ఇన్వెస్టర్లయిన ఎర్లింగ్‌ హాలాండ్‌ (ఫుట్‌బాల్‌), నయోమి ఒసాకా (టెన్నిస్‌ దిగ్గజం), ప్యాట్రిక్‌ మహోమ్స్‌ (సూపర్‌ బౌల్‌), యా మొరాంట్‌ (ఎన్‌బీఏ) రికీ ఫౌలర్‌ (గోల్ఫ్‌) సరసన కోహ్లి చేరతారు.

చ‌ద‌వండి: చ‌ద‌వండి: సంసద్‌ టీవీ సీఈవోగా నియ‌మితులైన రిటైర్డు ఐఏఎస్‌ అధికారి?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సంసద్‌ టీవీ హోస్ట్‌లుగా వ్యవహరించనున్న ప్రతిపక్ష ఎంపీలు?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 17
ఎవరు    : శశిథరూర్, ప్రియాంక చతుర్వేది   
ఎందుకు    : టు ది పాయింట్‌(శశిథరూర్‌), మేరి కహానీ(ప్రియాంక చతుర్వేది) కార్యక్రమాలను నిర్వహించేందుకు...

 

Published date : 17 Sep 2021 02:36PM

Photo Stories