Skip to main content

Mount Everest: 53 ఏళ్ల వయసులో 27వసారీ ఎవరెస్ట్‌నెక్కి.. తన రికార్డు తానే..

నేపాల్‌కు చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా మరోమారు ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించి తన గత రికార్డును తానే చెరిపేసి కొత్త రికార్డ్‌ను లిఖించారు.
Nepali Climber

53 ఏళ్ల రీటా మే 17న‌ విజయవంతంగా 27వసారీ ఎవరెస్ట్‌ను ఎక్కారని నేపాల్‌ పర్యాటక శాఖ ప్రకటించింది. దీంతో నూతన ప్రపంచ రికార్డు ఆవిష్కృతమైంది. గత ఏడాది రీటా 26వసారి ఎవరెస్ట్‌ పర్వతారోహణ విజయవంతంగా పూర్తిచేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆ రికార్డును మూడు రోజుల క్రితం మరో షెర్పా అయిన 46 ఏళ్ల పసంగ్‌ దవా సమం చేశారు. దీంతో రీటా మే 17న‌ మరోమారు పర్వతమెక్కి తన పేరిట రికార్డును లిఖించుకున్నారు.
ఎక్కువ ఎత్తున్న పలు శిఖరాలను అధిరోహించారు. సీనియర్‌ మౌంటేన్‌ గౌడ్‌గా పనిచేస్తున్నారు. బుధవారంనాటి పర్వతారోహణకు అయిన ఖర్చులను కఠ్‌మాండూకు చెందిన ఒక వాణిజ్య సాహసయాత్రల నిర్వహణ సంస్థ భరించింది. ఈ స్ప్రింగ్‌ సీజన్‌లో ఇప్పటిదాకా మొత్తంగా 478 మందికి ఎవరెస్ట్‌ ఎక్కేందుకు అనుమతులు వచ్చాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (16-22 ఏప్రిల్ 2023)

Published date : 18 May 2023 03:01PM

Photo Stories