Skip to main content

Historian: జానతా రాజా నాటకాన్ని రూపొందించిన పద్మవిభూషణ్‌ అవార్డీ?

Balwant Moreshwar Purandare

ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత బల్వంత్‌ మోరేశ్వర్‌ పురందరే(99) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన నవంబర్‌ 15న పూణెలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై విశేషమైన పరిశోధనలతో పురందరే దేశంలోనే ఖ్యాతికెక్కారు. ఆయన 1950లలో రాజా శివచక్రవర్తి పేరిట రాసిన పుస్తకం, జానతా రాజా పేరుతో రూపొందించిన నాటకం ఎంతో ప్రసిద్ధి చెందాయి. బాబాసాహెబ్‌ పురందరేగా చిరపరిచితుడైన పురందరేను 2015లో మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు వరించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్‌ అవార్డును స్వీకరించారు.
 

చ‌ద‌వండి: రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా నియమితులైన అధికారి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్‌ 15
ఎవరు    : బల్వంత్‌ మోరేశ్వర్‌ పురందరే(99)
ఎక్కడ    : పూణె, మహారాష్ట్ర
ఎందుకు  : అనారోగ్య కారణాలతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Nov 2021 01:58PM

Photo Stories