Skip to main content

Electoral Bonds: ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు

దేశంలో రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
 22,217 Bonds Issued from April 1, 2019 to February 15, 2024   SBI submits Electoral Bonds details in Supreme Court   Electoral Bond Purchases and Conversions

2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు విరాళం రూపంలో అందజేశారంది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది. 

నిబంధనల ప్రకారం.. జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లో నగదుగా మార్చుకోకపోవడం వల్ల మిగిలిపోయిన 187 బాండ్లకు సంబంధించిన డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌కుమార్‌ ఖరా మార్చి 13వ తేదీ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందజేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రతి బాండ్‌ను కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదార్ల పేర్లు, బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న తేదీ వంటి అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి డిజిటల్‌ రూపంలో అందజేశామని తెలిపారు.

RBI: ఆర్‌బీఐ ఉద్గమ్‌ పోర్టల్‌లోకి 30 బ్యాంకులు

Published date : 14 Mar 2024 03:47PM

Photo Stories