Vande Bharat: రూ.120 కోట్లతో ‘వందేభారత్’
Sakshi Education
200 వందేభారత్ రైళ్ల తయారీ, నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానించగా, రష్యాకు చెందిన సీజేఎస్సీ ట్రాన్స్మాష్హోల్డింగ్, భారత్కు చెందిన రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్(టీఎంహెచ్–ఆర్వీఎన్ఎల్) కన్సార్టియం లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది.
![Vande Bharat Trains](/sites/default/files/images/2023/03/02/vande-bharath-trains-1677757661.jpg)
కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ బీహెచ్ఈఎల్, టిటాగఢ్ వ్యాగన్స్ కన్సార్టియం రెండో లోయెస్ట్గా అవతరించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐసీఎఫ్–చెన్నై ఒక్కో వందేభారత్ రైలును రూ.128 కోట్లతో తయారు చేసింది. తాము రూ.120 కోట్లతోనే తయారు చేస్తామని టీఎంహెచ్–ఆర్వీఎన్ఎల్ కన్సార్టియం వెల్లడించింది. ఇక బీహెచ్ఈఎల్–టిటాగఢ్ వ్యాగన్స్ కన్సార్టియం ఒక్కో రైలును రూ.140 కోట్లతో తయారు చేసేందుకు ముందుకొచ్చింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
Published date : 02 Mar 2023 05:17PM