Skip to main content

Jharkhand: రిజర్వేషన్లను 77శాతానికి పెంచుతూ ఝార్ఖండ్‌ శాసన సభలో బిల్లు ఆమోదం

ఝార్ఖండ్‌లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60 శాతం నుంచి 77 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర శాసనసభ ఓ బిల్లును ఆమోదించింది.
reservation new bill in jharkhand government

రాష్ట్రంలో షెడ్యూల్డ్‌కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు(ఓబీసీ), ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తాజా బిల్లు వల్ల 77శాతానికి పెరుగుతాయి. దీనికి చట్టబద్ధత అందించడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో తగు మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కొత్త బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. బిల్లు వల్ల ఇకపై స్థానిక షెడ్యూల్డ్‌కులాలకు 12శాతం కోటా, షెడ్యూల్డ్‌తెగలకు 28శాతం, అత్యంత వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) 15శాతం, ఇతర వెనుకబడిన వర్గాలకు(ఓబీసీ)12శాతం, ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం కోటాలు లభిస్తాయి. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో షెడ్యూల్డ్‌ కులాలకు 10శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు 26 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయి.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 06:12PM

Photo Stories