Skip to main content

Mahakumbh Mela: కుంభమేళాలో పాల్గొననున్న ప్ర‌ముఖులు, రాజకీయ నేతలు వీరే.. 5న మోదీ పుణ్యస్నానం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా భక్తులతో నిండిపోతోంది.
PM Narendra Modi Set To Visit Maha Kumbh Mela On February 5th

జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. అప్ప‌టివ‌ర‌కు అనేక ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఈ పవిత్ర మేళాలో పాల్గొననున్నారు.

➤ ఫిబ్రవరి 5వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన భక్తులతో కలిసి దైవిక ఆశీర్వాదాలను పొందేందుకు ప్రత్యేకంగా పాల్గొంటారు.

➤ జనవరి 27వ తేదీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. అలాగే, గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొని, భద్రతను సమీక్షిస్తారు.

➤ ఫిబ్రవరి 1వ తేదీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానం చేస్తారు.

➤ ఫిబ్రవరి 10వ తేదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌కి రానున్నారు. వారు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Mauni Amavasya: మౌని అమావాస్యా.. ఆ రోజు అనుసరించాల్సిన పద్ధతులు ఇవే.. కుంభమేళాలో ఇది అత్యంత ప్రత్యేకమైన రోజు! ఆ రోజు ఎప్పుడంటే..?

కుంభమేళా పర్వాలు..
మౌని అమావాస్య(రెండో షాహీ స్నానం): జనవరి 29న రెండో షాహీ స్నానం జరుగనుంది. ఈ రోజు విశేషంగా భక్తులు గంగానదిలో స్నానం చేస్తారు.
వసంత పంచమి: ఫిబ్రవరి 3వ తేదీన మూడో షాహీ స్నానం జరుగనుంది.
మాఘ పూర్ణిమ: ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా మరింత భక్తుల ప్రవాహం ఉంటుందని అంచనా.
మహాశివరాత్రి: ఫిబ్రవరి 26న, మహాశివరాత్రి రోజున కుంభమేళా ముగుస్తుంది.

భక్తుల సంఖ్య: జనవరి 20 నాటికి, 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గణాంకాలు తెలిపాయి.

భద్రతా చర్యలు: భద్రత క్రమంలో ప్రధాన కూడళ్ల వద్ద సెక్యూరిటీ తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ప్రభుత్వ అధికారులు భద్రతా అంశాలను సమీక్షిస్తూ, కుంభమేళా ప్రాంగణంలో భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 

Maha Kumbh 2025:: మహా కుంభమేళాలో 'ఒకే ప్లేట్, ఒకే బ్యాగ్'

Published date : 23 Jan 2025 08:44AM

Photo Stories