Railway: నిమిషానికి 2.25 లక్షల టికెట్లు అందించనున్న రైల్వే
Sakshi Education
రైల్వే టికెట్ రిజర్వేషన్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
![](/sites/default/files/images/2023/02/04/railway-minister-1675496421.jpg)
ఎంక్వైరీ విభాగం నిమిషానికి 40 వేల కాల్స్ తీసుకుంటుడగా, ఈ సామర్థ్యాన్ని 4 లక్షలకు పెంచుతామని ఫిబ్రవరి 3వ తేదీ మీడియాకు తెలిపారు. 2022–23లో కొత్తగా 4,500 కిలోమీటర్ల రైల్వే లైన్ (రోజుకు 12 కి.మీ.) వేయాలన్న లక్ష్యాన్ని సాధించాం. ఈ ఏడాది 7,000 కి.మీ. రైలు మార్గం నిర్మించనున్నాం’’ అన్నారు.
Vande Bharat Trains: అందుబాటులోకి మరో మూడు వందే భారత్ రైళ్లు
Published date : 04 Feb 2023 01:10PM