Skip to main content

Road Accidents: నాలుగు లక్షల రోడ్డు ప్రమాదాలు

దేశంలో 2021 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2020లో 3,66,138 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా 2021లో ఇవి 4,12,432కు చేరాయని వివరించింది.

కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ డిసెంబ‌ర్ 22న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చింది. ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు ఇంజనీరింగ్‌ నిపుణుల సూచనల ప్రకారం రహదారుల పునర్నిర్మాణం, రహదారి భద్రతను పటిష్టం చేయడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏ ఒక్క జాతీయ రహదారిని కూడా మూసివేసే ప్రతిపాదన లేదని తెలిపారు. రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీస్‌ వద్ద ఇప్పటి వరకు 5,215 వాహనాలను తుక్కుగా మార్చినట్లు చెప్పారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

Published date : 23 Dec 2022 02:59PM

Photo Stories