Skip to main content

PM Modi: భద్రతా వైఫల్యంపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?

Home Ministry

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని జనవరి 6న ఏర్పాటు చేసింది. కమిటీకి కేబినెట్‌ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్‌ కుమార్‌ సక్సేనా నాయకత్వం వహిస్తారు. ఇందులో ఐబీ జాయింట్‌ డైరెక్టర్‌ బల్బీర్‌ సింగ్, ఎస్‌పీజీ ఐజీ సురేశ్‌ సభ్యులుగా ఉన్నారు. వేగంగా నివేదిక అందించాలని కమిటీని హోంశాఖ కోరింది. అలాగే ఘటనపై తక్షణ నివేదిక ఇవ్వాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని హోంశాఖ ఆదేశించింది.

ద్విసభ్య కమిటీ వేసిన పంజాబ్‌..

మరోవైపు ఇదే ఘటనపై విచారణకు పంజాబ్‌ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ జడ్జి మెహతాబ్‌ సింగ్‌ గిల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్‌ వర్మతో కూడిన ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదికనందిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంజాబ్‌కు వచ్చిన ప్రధాని తీవ్రమైన భద్రతాలోపం కారణంగా జనవరి 5న అర్ధాంతరంగా ఢిల్లీకి వెనుదిరిగిన సంగతి తెలిసిందే!

చ‌ద‌వండి: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కేబినెట్‌ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్‌ కుమార్‌ సక్సేనా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు 
ఎప్పుడు : జనవరి 6
ఎవరు    : కేంద్ర హోంశాఖ
ఎందుకు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Jan 2022 03:36PM

Photo Stories