Skip to main content

PM College of Excellence: 'పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ప్రారంభించిన అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్‌లోని మొత్తం 55 జిల్లాల్లో 'ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్'ని వర్చువల్‌గా జూలై 14వ తేదీ ప్రారంభించారు.
Amit Shah Inaugurates 'PM College of Excellence' in 55 MP districts

ఇండోర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్‌లో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడంలో నరేంద్ర మోడీ దూరదృష్టిని ప్రశంసించారు. దీనిని ప్రారంభించడం కేవలం ఈ కళాశాలల పేరు మార్చడం మాత్రమే కాదని అన్నారు.

ప్రధాన్ మంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తింపు పొందేందుకు అర్హత సాధించేందుకు నిర్ణయించిన పారామీటర్‌లు, ప్రమాణాలకు అనుగుణంగా కళాశాలలను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.486 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈ కళాశాలల్లో కంపార్ట్‌మెంటల్‌ విద్య ఉండదని చెప్పారు. విద్యార్థులు తప్పనిసరిగా కొత్త విద్యా విధానం(ఎన్ఈపీ) డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు.

Sampoornata Abhiyan: ‘సంపూర్ణత అభియాన్’ను ప్రారంభించిన‌ నీతి ఆయోగ్

Published date : 17 Jul 2024 06:04PM

Photo Stories