Skip to main content

Chopper Crash: ఎంఐ–17వీ5 ప్రమాదంపై ఎవరి నేతృత్వంలో దర్యాప్తు జరగనుంది?

Rajnath Singh

ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రారంభమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు డిసెంబర్‌ 9న పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రకటించారు. ఐఏఎఫ్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం తమిళనాడులోని వెల్లింగ్టన్‌కు చేరుకుందని పేర్కొన్నారు. తమిళనాడు నీలగిరి కొండల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ, రాజ్యసభలో ఎంపీలు నివాళులర్పించారు.

బ్లాక్‌ బాక్స్‌ లభ్యం

చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మరో 11 మందిని బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలకమైన ఫ్లైట్‌ డేటా రికార్డర్‌(బ్లాక్‌ బాక్స్‌)ను గురువారం వెలికితీశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్‌ బాక్స్‌లోని సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
చ‌ద‌వండి: పీఎంఏవై–జీను ఎప్పటి వరకు పొడిగించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో దర్యాప్తు  ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్‌ 9
ఎవరు    : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
ఎందుకు : ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదం ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Dec 2021 04:04PM

Photo Stories