Skip to main content

Warship: మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు

థాయ్‌లాండ్‌ సముద్రజలాల్లో ఆ దేశానికి చెందిన ఓ యుద్ధనౌక మునిగిపోయింది.

ప్రచుయాప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లోని బాంగ్‌సఫాన్‌ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో హెచ్‌టీఎంఎస్‌ సుఖోథాయ్‌ యుద్ధనౌక గస్తీ కాస్తోంది. ఆ ప్రాంతంలో వేటకొచ్చే చేపలపడవల సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాల బాధ్యతలను ఈ నౌక చూసుకునేది. డిసెంబ‌ర్ 18న‌ రాత్రి భారీ అలలు ఈ నౌకను అతలాకుతలం చేశాయి. సముద్రనీరు చేరడంతో నౌకలో విద్యుత్‌ వ్యవస్థ స్తంభించడంతో నావికులు నౌకను అదుపుచేయడంలో విఫలమయ్యారు. దీంతో పక్కకు ఒరగడం మొదలై పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటనలో 31 మంది నావికులు గల్లంతు అయ్యారు. వీరి కోసం థాయ్‌లాండ్‌ నావికాదళ హెలికాప్టర్లు, నౌకల్లో సైన్యం అన్వేషిస్తోంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Published date : 20 Dec 2022 12:20PM

Photo Stories