Skip to main content

G20 Summit: ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’

న్యూఢిల్లీ/బాలి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కించడం, ఆహార, ఇంధన భద్రత తదితర కీలకాంశాలపై పలువురు దేశాధినేతలతో లోతుగా చర్చస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
  'One Earth, One Family, One Future', India's G-20 Presidency
'One Earth, One Family, One Future', India's G-20 Presidency

మొదలవుతున్న 17వ జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మూడో రోజుల పర్యటన నిమిత్తం ఆయన నవంబర్ 14 న ఇండొనేసియాలోని బాలికి చేరుకున్నారు. 

Also read: G20 Summit 2022: భార‌త్‌కు అధ్యక్ష బాధ్యతలు.. సదస్సుకు ముందుగానే మోదీ..

పలు రంగాల్లో భారత్‌ సాధించిన అద్భుత ప్రగతి, గ్లోబల్‌ వార్మింగ్‌ తదితర ప్రపంచ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని జీ 20 వేదికపై ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది (2023) భారత్‌ సారథ్యంలో జరిగే జీ 20 సదస్సుకు ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’ (వసుధైవ కుటుంబం) ప్రధాన నినాదంగా ఉండబోతోందని పేర్కొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడి నుంచి జీ 20 సారథ్య బాధ్యతలు భారత్‌ స్వీకరించనుండటాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో విడిగా భేటీ అవుతానని వెల్లడించారు.   అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు జో బైడెన్, షీ జిన్‌పింగ్, ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తదితరులు భేటీలో పాల్గొననున్నారు.  

Also read: G-20 : భారత్‌ నాయకత్వం.. G-20 లోగో, థీమ్, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ..

మనకు గొడవలొద్దు–జిన్‌పింగ్‌తో భేటీలో జో బైడెన్‌  
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ నవంబర్ 14న ఇండొనేషియాలోని బాలీలో సమావేశమయ్యారు. అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌తో బైడెన్‌కు ఇదే తొలి ముఖాముఖి! తైవాన్‌ తదితర అంశాల్లో ఇటీవల ఇరు దేశాల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.  భేదాభిప్రాయాలు తొలగించుకునేందుకు కలిసి పనిచేద్దామని బైడెన్‌ అన్నారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 15 Nov 2022 03:12PM

Photo Stories