Skip to main content

Landslide: న్యూ గినియాలో తీవ్ర విషాదం.. కొండచరియల కారణంగా 2,000 మంది మృతి!!

పసిఫిక్‌ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడి యంబలి గ్రామాన్ని నేలమట్టం చేసింది.
Massive Landslide Effect 2000 People Dead At Papua New Guinea  Emergency response efforts in Papua New Guinea after landslide in Yambali village

ఈ ఘటనలో దాదాపు 2000 మంది సజీవ సమాధి అయ్యారని ఆ దేశ నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌ పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఆఫీసుకు పాపువా న్యూ గినియా అధికారులు సమాచారం ఇచ్చారు.

వివరాల ప్రకారం.. పావువా న్యూ గినియాలో కొండ చరియలు విరగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు రెండు వేల మంది సజీవ సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్టు సమాచారం. కాగా, చాలా చోట్ల ఇలా కొండచరియలు విరిగి పడుతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. పెద్ద సైజులో బండరాళ్లు ఉండటంతో మృతదేశాల వెలికితీత కష్టంగా మారింది.  

 

 

ఈ ప్రమాద ఘటన కారణంగా తమ దేశానికి తగు సాయం అందించాలని అక్కడి ప్రభుత్వం కోరింది. అలాగే.. మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్‌ సెంటర్‌ ద్వారా సమన్వయం చేసుకొంటామని పేర్కొంది.

మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్‌ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ మైగ్రేషన్‌(ఐవోఎం) తెలిపింది.

New Covid Wave: మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ వేవ్.. వారంలో 26 వేల కేసులు!!

Published date : 28 May 2024 11:22AM

Photo Stories