Skip to main content

Indonesia Earthquake: ఇండోనేసియాలో భూకంపం.. 268 మంది మృతి

ఇండోనేసియాలోని జావా దీవిలో నవంబర్‌ 21న వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి పెరిగింది. మరో 151 మంది జాడ తెలియాల్సి ఉందని, 1,083 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

వారిలో 300 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులేనని పశ్చిమ జావా గవర్నర్‌ చెప్పారు. 13 వేల నివాసాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చనే భయాందోళనల మధ్య ప్రజలు రోడ్లపైనే చీకట్లో గడిపారు. నవంబర్‌ 22న దేశాధ్యక్షుడు జోకో విడొడొ సియంజుర్‌లో పర్యటించారు.

ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం?

Published date : 23 Nov 2022 01:16PM

Photo Stories