Skip to main content

Garuda Shakti 2022: భారత్-ఇండోనేషియా సంయుక్త సైనిక విన్యాసాలు

భారత-ఇండోనేషియా ప్రత్యేక సైనిక దళాలు ఇండోనేషియాలోని కరవాంగ్‌లోని సంగ్గ బువాన శిక్షణ కేంద్రంలో జ‌రిగే శిక్షణ విన్యాసాల కార్యక్రమం 'గరుడ శక్తి'లో పాల్గొన్నాయి.

'గరుడ శక్తి' పేరిట జరుగుతున్న ఉమ్మడి శిక్షణ విన్యాసాల పరంపరలో ఇది ఎనిమిదవది.

రెండు సైన్యాల ప్రత్యేక బలగాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో 2022 నవంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక దళాల నైపుణ్యాలను పెంచడం, ఆయుధాలు, పరికరాలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, విధానాలు, వివిధ ఆపరేషన్ల నుంచి నేర్చుకున్న పాఠాల సమాచారాన్ని పంచుకోవడం, అడవుల్లో ప్రత్యేక దళ ఆపరేషన్లు, ఉగ్రవాద శిబిరాలపై దాడులు, రెండు దేశాల జీవనశైలి, సంస్కృతి గురించి అవగాహన పెంచడం ఈ సంయుక్త శిక్షణ విన్యాసాల్లో భాగం. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం 13 రోజుల పాటు సాగుతుంది.

ఇరు సైన్యాలు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడానికి, ఉగ్రవాద కార్యకలాపాల మీద ఎదురుదాడులు, అంతర్జాతీయ వాతావరణంలో ప్రాంతీయ భద్రత కార్యకలాపాలు & శాంతి పరిరక్షణలో తమ విస్తృత అనుభవాలను పంచుకోవడానికి ఈ ఉమ్మడి విన్యాసాలు రెండు సైన్యాలకు వీలు కల్పిస్తుంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను, ప్రాంతీయ భద్రతను పెంచడంలో ఈ కార్యక్రమంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

 

Published date : 26 Nov 2022 04:17PM

Photo Stories