Skip to main content

Reserve Bank of India: ఆర్‌బీఐ ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవం థీమ్‌ ఏమిటీ?

RBI 600x400

ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ‘ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవ’ కార్యక్రమం ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను సురక్షిత పద్ధతుల్లో ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అవగాహన పెంచేదిలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ లావాదేవీల్లో ఉన్న సౌకర్యం, డిజిటల్‌ లావాదేవీల భద్రత, కస్టమర్లు తమను తాము రక్షించుకోవడం అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తుంది. ‘గో డిజిటల్, గో సెక్యూర్‌’ అన్న ప్రధాన థీమ్‌తో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల ప్రాతపై విస్తృత ప్రచారం జరగనుంది.

2016 నుంచి..

2016 నుంచి ఆర్‌బీఐ వార్షికంగా ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020–25 ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌ జాతీయ వ్యూహంలో ‘గో డిజిటల్, గో సెక్యూర్‌’ అనే థీమ్‌ ఒకటని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

చ‌ద‌వండి: 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనున్న విభాగం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవ కార్యక్రమం ప్రారంభం
ప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)
ఎక్కడ    : దేశవ్యాప్తంగా..
ఎందుకు : డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను సురక్షిత పద్ధతుల్లో ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అవగాహన పెంచేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Feb 2022 03:41PM

Photo Stories