Skip to main content

BOSCH India: ‘బాష్‌’ స్పార్క్‌ నెక్ట్స్‌’క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi inaugurates Bosch India's 'smart' campus
PM Narendra Modi inaugurates Bosch India's 'smart' campus

భారత్‌కు బాష్‌ కంపెనీ ఎప్పుడో జర్మనీ నుంచి వచ్చినా ఇప్పుడు అది పూర్తిగా భారతీయతను సంతరించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆటోమొబైల్‌ విడిభాగాలు మొదలుకొని సెక్యూరిటీ, గృహోపకరణాలు తయారు చేసే బాష్‌ కంపెనీ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి వందేళ్లయింది. ఈ సందర్భంగా జూన్ 30న బాష్‌ బెంగళూరులో ‘స్పార్క్‌ నెక్ట్స్‌‘ పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రధాని ఆవిష్కరించారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ ఆవిష్కరణలో ప్రధాని మాట్లాడుతూ భారతీయ శక్తి, జర్మన్‌ ఇంజినీరింగ్‌ల సమర్థ మేళవింపునకు బాష్‌ కంపెనీ మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న సమయంలో బాష్‌ వందేళ్లు పూర్తి చేసుకోవడం ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకతను కల్పిస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. 

Also read: High Court: ఐదుగురు న్యాయమూర్తులకు చీఫ్‌ జస్టిస్‌లుగా పదోన్నతి

Published date : 01 Jul 2022 05:34PM

Photo Stories