Skip to main content

Omega Seiki Mobility: ఓఎస్‌ఎం త్రీవీలర్‌ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?

Omega Seiki Mobility-OSM

విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఒమేగా సైకీ మొబిలిటీ (ఓఎస్‌ఎం) తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ ప్లాంటును కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. దాదాపు 250 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1,900 కోట్లు)తో 250 ఎకరాల స్థలంలో 10 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఈ  ప్లాంటును మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఏప్రిల్‌ 22న ఒమేగా సైకీ మొబిలిటీ వ్యవస్థాపక చైర్మన్‌ ఉదయ్‌ నారంగ్‌ తెలిపారు. రేజ్‌ప్లస్‌ ఫ్రాస్ట్, రేజ్‌ప్లస్‌ తదితర త్రీ వీలర్లను కొత్త ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆగ్నేయాసియా దేశాలు, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య మార్కెట్ల కోసం వాహనాలను మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు.

ISRO: న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?

Ministry of Finance: ఏ కంపెనీలను పీఎస్‌ఈలు కొనుగోలు నిషిద్ధం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
త్వరలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్‌ 22
ఎవరు    : ఒమేగా సైకీ మొబిలిటీ (ఓఎస్‌ఎం)
ఎక్కడ    : కర్ణాటక
ఎందుకు : రేజ్‌ప్లస్‌ ఫ్రాస్ట్, రేజ్‌ప్లస్‌ తదితర త్రీ వీలర్ల ఉత్పత్తి కోసం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Apr 2022 12:21PM

Photo Stories