Skip to main content

GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి

India's June GST collections
India's June GST collections

జీఎస్టీ కౌన్సిల్‌ సిఫారసు మేరకు జీఎస్టీలో సంస్కరణల ఫలితంగా మొదటి త్రైమాసికంలో జీఎస్టీ ఆదాయం పుంజుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు 37% పెరిగి రూ.1.51 లక్షల కోట్లకు చేరుకున్నాయని టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేతలు అడిగిన ప్రశ్నలకు జూలై 18న  కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జీఎస్టీ పరిహారం చెల్లింపును ఐదేళ్లకు మించి పొడిగించాలని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు కోరాయని తెలిపారు.  

Also read: FIH అధ్యక్ష పదవికి నరీందర్ బత్రా రాజీనామా
 

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

 

Published date : 20 Jul 2022 12:58PM

Photo Stories