Skip to main content

Sugarcane Molasses: చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం ఏమిటో తెలుసా..!

ప్రస్తుత సీజన్‌‌లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Government levies 50% Export Duty On Molasses    Measures to support domestic distilleries in sugar industry

ఈ తరుణంలో చెరకు నుంచి తీసే ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన మొలాసిస్‌‌పై ప్రభుత్వం 50 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ నిబంధనలు జనవరి 18 నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయ డిస్టిలరీల కోసం మొలాసిస్‌ను అందుబాటులో ఉంచడం, పెట్రోల్‌, డీజిల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
 
ప్రస్తుత సంవత్సరంలో పెట్రోల్‌‌లో 15 శాతం ఇథనాల్‌‌ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మళ్లింపు లేకపోవడం వల్ల 2023-24 సీజన్‌‌లో (అక్టోబర్-సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి 37.3 మిలియన్ టన్నుల నుంచి 32.3-33 మిలియన్ టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తలిపింది. 

మొలాసిస్‌‌ను ఎగుమతి చేస్తున్న రాష్ట్రాలివే..
వియత్నాం, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ ఫిలిప్పీన్స్‌‌తో సహా ఇతర దేశాలకు భారతదేశం మొలాసిస్‌‌ను ఎగుమతి చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్  రాష్ట్రాలు మొలాసిస్‌‌ను ఎగుమతి చేస్తున్నాయి.

Oxfam Report: వామ్మో.. డబ్బు ఉన్నవారు.. లేనివారికి మధ్య ఇంత తేడానా..!

 

Published date : 20 Jan 2024 11:26AM

Photo Stories