Skip to main content

Unemployed Youth: డిజిసాక్షం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిన మంత్రిత్వ శాఖ?

Ministry of Labour

యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంచడానికి డిజిసాక్షం పేరుతో నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. డిజిసాక్షంలో భాగంగా నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌ ద్వారా యువతకు డిజిటల్‌ నైపుణ్యాలను కల్పిస్తారు. తొలి ఏడాది మూడు లక్షల పైచిలుకు మందికి శిక్షణ ఇస్తారు. డిజిసాక్షంకు టీఎంఐ ఈ2ఈ అకాడమీ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా ఉండగా... మైక్రోసాఫ్ట్‌ సహకారం అందిస్తోంది.

మోల్డ్‌టెక్‌ మరో రెండు ప్లాంట్లు

ఇంజెక్షన్‌ మోల్డెడ్‌ ప్లాస్టిక్‌ కంటైనర్ల తయారీ దిగ్గజం మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ మరో రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ వద్ద ఇంజెక్షన్‌ బ్లో మౌల్డింగ్‌ (ఐబీఎం) ప్యాకేజింగ్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రూ.50 కోట్లతో నెలకొల్పనుంది. అలాగే రూ.20 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు మోల్డ్‌టెక్‌ గ్రూప్‌ తెలిపింది.

 

ప్రపంచంలో ఏకైక సంస్థ...

రోబోలను వినియోగించి ప్లాస్టిక్‌ కంటైనర్లను అలంకరణకు ఇన్‌ మోల్డ్‌ లేబులింగ్‌ (ఐఎంఎల్‌) విధానాన్ని దేశంలో పరిచయం చేసిన తొలి సంస్థగా మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ రికార్డు సాధించింది. ప్రపంచంలో ఐఎంఎల్‌ డెకోరేషన్‌ కోసం రోబోలను సొంతంగా రూపకల్పన చేసి తయారు చేస్తున్న ఏకైక ప్యాకేజింగ్‌ సంస్థ కూడా ఇదే. భారత్‌లో సంస్థకు 9 తయారీ కేంద్రాలు ఉన్నాయి.

చ‌ద‌వండి: దేశీయంగా అత్యంత సంపదపరుల సంఖ్య ఎంత?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : డిజిసాక్షం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిన మంత్రిత్వ శాఖ?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 30
ఎవరు    : కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు  : యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు...

 

Published date : 01 Oct 2021 04:18PM

Photo Stories