Skip to main content

Largest Shareholder: ఏ టెలికం కంపెనీలో ప్రభుత్వానికి వాటా లభించనుంది?

VI

రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్‌ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్‌) ఖాయం చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది.

తాజా ఈక్విటీ జారీతో వొడాఫోన్‌ ఐడియాలో  ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు కంపెనీ అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్‌ గ్రూప్‌ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్‌ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది.

టాటా టెలీలోనూ వాటా..

ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్‌ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్‌ ఐడియా బాటలో ఏజీఆర్‌ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. 

GK Economy Quiz: S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం FY22కి భారతదేశ GDP వృద్ధి ఎంత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఏ టెలికం కంపెనీలో ప్రభుత్వానికి వాటా లభించనుంది?
ఎప్పుడు  : జనవరి 10
ఎవరు    : వొడాఫోన్‌ ఐడియా సంస్థ
ఎందుకు  : రుణ భారంతో సతమతమవుతున్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Jan 2022 03:39PM

Photo Stories