Skip to main content

Cement Supply: దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరా ప్రారంభించిన సంస్థ?

Bharathi Cement

సిమెంట్‌ సరఫరాలో సరికొత్త అధ్యాయానికి భారతి సిమెంట్, కాంకర్‌ గ్రూప్‌ నాంది పలికాయి. దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరాను ప్రారంభించాయి. ఇందుకోసం కాంకర్‌ గ్రూప్‌ రూపొందించిన 20 అడుగుల కస్టమైజ్డ్‌ ట్యాంక్‌ కంటైనర్స్, లైనర్స్‌తో కూడిన బాక్స్‌ కంటైనర్స్‌ను భారతి సిమెంట్‌ వినియోగించింది. వికా గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన భారతి సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంటు ఉంది. ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బల్క్‌ సిమెంట్‌తో కూడిన రైలు ఏప్రిల్‌ 22న ప్రారంభమైంది.

Ministry of Finance: ఏ కంపెనీలను పీఎస్‌ఈలు కొనుగోలు నిషిద్ధం?

కర్బన్‌ ఉద్గారాల తగ్గుదల..
ప్రధాన మార్కెట్లు అయిన చెన్నై, నైరుతీ తమిళనాడు, కేరళకు ‘బల్క్‌’ విధానంలో సిమెంట్‌ సరఫరా చేయనున్నట్టు భారత్‌లో వికా గ్రూప్‌ సీఈవో అనూప్‌ కుమార్‌ సక్సేనా తెలిపారు. రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కోయంబత్తూరులో ప్రత్యేక ప్యాకేజింగ్‌ టెర్మినల్‌ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కంటైనర్లు, అత్యాధునిక టెర్మినల్‌ కోసం రూ.130 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.

ISRO: న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరాను ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 22
ఎవరు    : భారతి సిమెంట్‌
ఎక్కడ    : ఎర్రగుంట్ల (వైఎస్సార్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌)– కోయంబత్తూరు(కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు) 
ఎందుకు : రైలు ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Apr 2022 01:16PM

Photo Stories