Skip to main content

Daily Current Affairs in Telugu: 2 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
Daily-Current-Affairs-in-telugu
2nd August Daily Current Affairs

1. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖపట్టణం కైలాసపురంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహేజా గ్రూప్స్‌ ఇనార్బిట్‌ మాల్‌కు భూమి పూజ చేశారు. 

2. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత షూటర్లు సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా పసిడి, ఆశి చౌక్సీ పసిడి, అర్జున్‌ సింగ్‌ చీమా, వరుణ్‌ తోమర్, అన్‌మోల్‌ జైన్‌లతో కూడిన జట్టు కాంస్య పతకాలు సాధించారు.

3. జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 11 శాతం పెరిగి (2022 ఇదే నెలతో పోల్చి) రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. 

☛☛ Daily Current Affairs in Telugu: 1 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

4. 22-23 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన మొత్తం ఆదాయ‌ రిటర్నుల సంఖ్య  6,77,42,303కు చేరింది.

5. ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ స‌నాపతి పల్లవి, వెంకట కృష్ణ రజతాలు , హారిక కాంస్య పతకాలు సాధించారు.

6. యు.పి. క్యాబినెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్, వాటర్ టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్ పాలసీ- 2023కి  ఆమోదం తెలిపింది.

☛☛ Daily Current Affairs in Telugu: 31 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 02 Aug 2023 06:54PM

Photo Stories