Skip to main content

6.77 crore IT returns: 6.77 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు

ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు అయిన సోమవారం పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చారు.
IT-Returns
IT Returns

చివరి రోజైన జూలై 31 ఒక్కరోజే 64.33 లక్షల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి దాఖలైన మొత్తం రిటర్నుల సంఖ్య  6,77,42,303కు చేరింది.ఇందులో 5,62,59,216 రిటర్నులు ఇ-వెరిఫై అయ్యాయి. వీటిలో 3,44,16,658 రిటర్నులను ప్రాసెస్‌ చేసినట్లు  ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. వేతన జీవులు, ఆడిటింగ్‌ అవసరం లేని వారు రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ కావడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి దాఖలైన 5.83 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 16.1% శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

☛☛ Income Tax Commissioner: ఇన్‌కమ్‌టాక్స్‌ కమిషనర్‌గా జాస్తి కృష్ణకిశోర్‌

Published date : 03 Aug 2023 10:43AM

Photo Stories