Skip to main content

Indian Navy: సోమాలియా పైరేట్ల ఆట కట్టించిన భారత వైమానిక దళం, నావికాదళం

భారత వైమానిక దళం, నావికాదళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌తో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టయ్యింది.
IAF Shares Visuals of C-17 Precision Airdrop from Joint Op with Navy
  • మూడు నెలల క్రితం హైజాక్‌ చేసిన సరుకు రవాణా నౌక ‘ఎంవీ రూయెన్‌’ను భారత దళాలు విజయవంతంగా విడిపించాయి.
  • 35 మంది సముద్రపు దొంగలను నావికాదళం అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
  • నౌకలో బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని రక్షించారు.
  • నౌకలో రూ.8.29 కోట్ల విలువైన 37,800 కోట్ల టన్నుల సరుకు ఉంది.
  • భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన సి–17 టాక్టికల్‌ రవాణా విమానం ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది.
  • జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా రెండు కాంబాట్‌ రబ్బరైజ్డ్‌ రైడింగ్‌ క్రాఫ్ట్‌(సీఆర్‌ఆర్‌సీ) బోట్లను, ‘మార్కోస్‌’ మెరైన్‌ కమాండోలను ఈ విమానం ద్వారా భారత తీరానికి 2,600 కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రంపైకి క్షేమంగా జారవిడిచారు.
  • ‘మార్కోస్‌’ మెరైన్‌ కమాండోలు అపూర్వమైన ధైర్యసాహసాలతో సముద్రపు దొంగలను లొంగదీసుకున్నారు.
  • మొత్తం ఆపరేషన్‌ 40 గంటలపాటు జరిగింది.

Mobile Phone: ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తి దేశం ఇదే..

Published date : 20 Mar 2024 01:32PM

Photo Stories