Skip to main content

FTA: ఏ దేశంతో భారత్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకోనుంది?

Jaishankar and Yair Lapid

భారత్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌–ఎఫ్‌టీఏ) జరగనుంది. ఈ ఒప్పంద విషయమై 2021, నవంబర్‌ నెలలో చర్చలు ప్రారంభంకానున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, ఇజ్రాయెల్‌ ప్రత్యామ్నాయ ప్రధానిగా వ్యవహరిస్తున్న విదేశాంగ మంత్రి యయర్‌ లాపిడ్‌ అక్టోబర్‌ 18న జెరూసలేంలో జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌టీఏపై గత పదేళ్లుగా కొనసాగుతున్న చర్చలను త్వరగా పునఃప్రారంభించి వచ్చే జూన్‌ నాటికి ముగించాలని ప్రతిపాదించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జైశంకర్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఇజ్రాయెల్‌ రాజధాని: జెరూసలేం; కరెన్సీ: న్యూ షెకెల్‌
ఇజ్రాయెల్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఐజాక్‌ హెర్జోగ్‌
ఇజ్రాయెల్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: నాఫ్తాలి బెన్నెట్‌
ఇజ్రాయెల్‌ ప్రత్యామ్నాయ ప్రధాని: యయర్‌ లాపిడ్‌ 
 

చ‌ద‌వండి: ప్రధాని మోదీతో సమావేశమైన డెన్మార్క్‌ ప్రధాని పేరు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఏ దేశంతో భారత్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకోనుంది?
ఎప్పుడు : అక్టోబర్‌ 18
ఎవరు    : ఇజ్రాయెల్‌
ఎందుకు : భారత్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యం కోసం...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Oct 2021 06:57PM

Photo Stories