Skip to main content

National Teachers Award: జాతీయ ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు అందుకున్న మృదుల

విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్‌ నందవరం మృదులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ అధ్యాపకురాలి అవార్డును ప్రదానం చేసింది.
Three Telangana Teachers Received National Teachers Award

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. 

హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ప్రొఫెసర్‌గా మృదుల పనిచేస్తున్నారు. ఆమెతో పాటు తాడూరి సంపత్‌కుమార్‌ (రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జెడ్పీ స్కూల్‌), పీసర ప్రభాకర్‌రెడ్డి (ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జెడ్పీ స్కూల్‌) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ అవార్డును అందుకున్న ఉపాధ్యాయులు మిద్దె శ్రీనివాసరావు, సురేష్ కుంతి. 

National Awards: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే..

Published date : 06 Sep 2024 04:13PM

Photo Stories