Skip to main content

Nobel Prize: ఆర్థిక నోబెల్‌ పురస్కారం–2021

Nobel Prize 2021 in Economics

సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించిన అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌ (65), జాషువా ఆంగ్రిస్ట్‌(61), గైడో ఇంబెన్స్‌(58)లకు 2021 ఏడాది ఆర్థిక నోబెల్‌ పురస్కారం లభించింది. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉన్న రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ విషయాన్ని అక్టోబర్‌ 11న ప్రకటించింది. నోబెల్‌ బహుమతిగా లభించే 11.45లక్షల డాలర్లలో సగం మొత్తం డేవిడ్‌ కార్డ్‌కు, మిగతా సగాన్ని జాషువా, గైడోలకు పంచుతారు.

డేవిడ్‌ కార్డ్‌...

  • 1956లో కెనడాలో జన్మించి అమెరికాలో స్థిరపడిన డేవిడ్‌ కార్డ్‌... అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ(1983) చేశారు.
  • ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • 1980వ దశకంలో అలెన్‌ క్రూగర్‌తో కలిసి వలస కార్మిక విపణి, కనీస వేతనాలపై పరిశోధన సాగించారు.
  • ఈ రంగాల్లో సంప్రదాయ భావనలను సవాల్‌ చేసేలా వినూత్న విశ్లేషణలను, లోతైన పరిజ్ఞానాన్ని అందించారు. కనీస వేతనాలను పెంచడం వల్ల ఇతరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన అవసరంలేదని నిరూపించారు. 
  • వలస కార్మికుల వల్ల స్వదేశంలోని వ్యక్తుల ఆదాయం వృద్ధిచెందడంతోపాటు పలు ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టం చేశారు. డేవిడ్‌ కార్డ్‌ ఈ అంశాన్ని నిరూపించే వరకు కొత్త వలసలపై ప్రతికూలమైన అభిప్రాయాలు ఉండేవి. 
  • డేవిడ్‌ కార్డ్‌కు మిత్రుడైన అలెన్‌ క్రూగర్‌ గతంలోనే నోబెల్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. అలెన్‌ 58 ఏళ్ల వయసులో 2019లో మరణించారు.

 

జాషువా, డేవిడ్‌...

  • అమెరికాలోని కొలంబస్‌లో 1960లో జన్మించిన జాషువా... ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు.
  • 1963లో నెదర్లాండ్స్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడిన డేవిడ్‌  అమెరికాలోని బ్రౌన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు.
  • వీరిద్దరూ వ్యక్తులపై సుదీర్ఘ విద్య చూపేప్రభావాన్ని విశ్లేషించారు.
  • ఒక బృందంలోని వ్యక్తుల చదువును ఏడాదిపాటు పొడిగించినప్పుడు వారందరిపై పడే ప్రభావం ఒకే విధంగా ఉండదని, దీనిపై ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేమని అప్పటి వరకు అనుకునేవారు. కానీ, 1990లో ఇదే అంశంపై సహజ పరిశోధనలను కొనసాగించిన జాషువా, డేవిడ్‌ విధాన ప్రకియలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించారు.
  • సహజ పరిశోధనల ద్వారా కార్యకారణ సంబంధాన్ని విశ్లేషిస్తూ కచ్చితమైన నిర్ధారణలకు రావచ్చని నిరూపించారు.
     

చ‌ద‌వండి: ఆర్థిక నోబెల్ పురస్కారం-2020

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆర్థిక నోబెల్‌ పురస్కారం–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్‌ 11
ఎవరు : డేవిడ్‌ కార్డ్‌ (65), జాషువా ఆంగ్రిస్ట్‌(61), గైడో ఇంబెన్స్‌(58) 
ఎందుకు : సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించినందున...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

    
డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 12 Oct 2021 01:57PM

Photo Stories