Skip to main content

73rd Republic Day: శౌర్యచక్ర అవార్డుకు ఎంపికైన అమర జవాను?

Shaurya Chakra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అమర జవాను మరుప్రోలు జస్వంత్‌ కుమార్‌ రెడ్డి(23)కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర అవార్డు ప్రకటించింది. దేశ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, దరివాదకొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్‌ రెడ్డి ఇంటర్మీడియట్‌ తరువాత చిన్న వయసులోనే భారత సైన్యంలో మద్రాస్‌ రెజిమెంట్‌లో సిపాయిగా చేరాడు. ఐదేళ్లగా ఆర్మీలో పనిచేస్తుండగా 2021, జూలై 8వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని రాజోరి జిల్లా సుందర్‌బాని సెక్టార్‌లో గస్తీ విధులు నిర్వర్తిస్తూ దట్టమైన అటవీప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు గుర్తించాడు. వెంటనే తమ రెజిమెంట్‌ను అప్రమత్తం చేయడమే కాకుండా ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు.

ఏపీకి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం

73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్రప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఏపీకి ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం, పలు రాష్ట్రపతి పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం లభించింది.

చ‌ద‌వండి: అశోక చక్ర అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
శౌర్యచక్ర అవార్డుకు ఎంపికైన అమర జవాను?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు    : మరుప్రోలు జస్వంత్‌ కుమార్‌ రెడ్డి(23, ఆంధ్రప్రదేశ్‌)
ఎందుకు : విధులు నిర్వర్తిస్తూ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి వీరమరణం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 29 Jan 2022 05:03PM

Photo Stories