Telangana Government Employees : ఇకపై ఈ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గుడ్న్యూస్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.
TSRTC
దీంతో, ఆర్టీసీ విలీనం ప్రక్రియకు లైన్క్లియర్ అయ్యింది. అలాగే గవర్నర్ తమిళిసై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. అయితే, బిల్లులో గవర్నర్ చేసిన 10 సిఫార్సులకు ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో బిల్లుకు తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక, నెల రోజుల తర్వాత బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం విశేషం.