Skip to main content

త్వరలో బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న265 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

సాక్షి, అమరావతి: బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 265 అసిస్టెంట్ ప్రొఫెసర్ (వైద్య అధ్యాపకుల) పోస్టులు భర్తీ చేయనున్నారు. 2014--19 మధ్య కాలంలో ఒక్క పోస్టుకూడా భర్తీ చేయలేదు.
మరోవైపు పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల ఖాళీలు ఏటికేటికీ పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 వైద్యకళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో సుమారు 30 విభాగాల్లో వైద్యవిద్యాశాఖ 265 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలను గుర్తించింది. వీటిని మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు వైద్యవిద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు ఖాళీల ప్రతిపాదనను ఆర్థికశాఖకు పంపించారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
Published date : 27 Feb 2020 01:56PM

Photo Stories