Skip to main content

Jawaharlal Nehru Technological University: అనంతపురం 'జేఎన్‌టీయూ'కు ఐఎస్‌ఓ గుర్తింపు

Jawaharlal Nehru Technological University

అనంతపురం: జేఎన్‌టీయూకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. గురువారం యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌ హాలులో సర్టిఫికేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య సుదర్శన్‌రావు మాట్లాడుతూ జేఎన్‌టీయూకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ రావడం గర్వకారణమన్నారు.

Jobs In TCS: గ్రాడ్యుయేట్లకు అవకాశం..టీసీఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

భవిష్యత్తులో నాణ్యత ప్రమాణాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ప్రతినిధి ఆలపాటి శివయ్య, రిజిస్ట్రార్‌ ఆచార్య కృష్ణయ్య, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్‌ ఆచార్య దుర్గాప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి నారాయణరెడ్డి పాల్గొన్నారు

Published date : 24 Aug 2024 11:17AM

Photo Stories