Skip to main content

College Students: 17 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

17 college students suspended

కొరుక్కుపేట: కుడంతై ప్రభుత్వ కళాశాలలో నిరసన తెలిపిన 17 మంది విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. తంజావూరు జిల్లా కుంభకోణంలోని ఈ కళాశాలలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 3 వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. కళాశాల ప్రవేశ ద్వారం ముందు 17 మంది విద్యార్థులు తరగతిని బహిష్కరించిన యూత్‌ బార్‌ ఆర్గనైజేషన్‌ తరఫున నిరసనలో పాల్గొన్నారు. అలాగే కళాశాలకు వచ్చిన ఇతర విద్యార్థులను క్లాసుకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు సమాచారం. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా తరగతిని బహిష్కరించి నిరసనకు దిగిన ఇద్దరు విద్యార్థినులు సహా 17 మంది విద్యార్థులను ప్రిన్సిపల్‌ మాధవి బుధవారం సస్పెండ్‌ చేశారు. సస్పెన్షనన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు గురువారం కుంభకోణం ఆర్‌డీఓ పూర్ణిమకు వినతిపత్రం సమర్పించారు.

చదవండి: Teacher Adjustment: ఉపాధ్యాయ సర్దుబాటులో మినహాయింపులు

Published date : 18 Aug 2023 06:19PM

Photo Stories