Skip to main content

ఉదోగ్యం రాలేదని యువకుడి ఆత్మహత్య

తిరువళ్లూరు: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆరంబాక్కంలో విషాదాన్ని నింపింది.
A young man commits suicide because he was not successful
ఉదోగ్యం రాలేదని యువకుడి ఆత్మహత్య

చైన్నె వ్యాసార్‌పాడి ప్రాంతానికి చెందిన త్యాగరాజన్‌కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, రెండో కుమారుడు సంజయ్‌(19) ఆరంబాక్కం సమీపంలోని ఎలావూర్‌ వద్ద ఉన్న బంధువుల ఇంట్లో ఉంటూ ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. గురువారం రాత్రి సంజయ్‌కు అతని తల్లి పలుమార్లు ఫోన్‌ చేయగా లిప్ట్‌ చేయలేదు. దీంతో ఆందోళన చెందిన త్యాగరాజన్‌ సంజయ్‌ ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి తలుపులు తట్టే ప్రయత్నం చేశాడు. అయితే తలుపులు తీయలేదు. దీంతో పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సంజయ్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దింపి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఆరంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Published date : 29 Jul 2023 03:34PM

Photo Stories