మహిళా జర్నలిస్టులకు ఏప్రిల్ 23, 24 తేదీల్లో వర్క్షాప్ నిర్వహించనున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
రెండు రోజులపాటు బేగంపేటలోని టూరిజం ప్లాజా లో నిర్వహించే ఈ వర్క్షాపులో దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొంటారని ఏప్రిల్ 22న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేధావులు, సీనియర్ జర్నలి స్టులు పాల్గొంటారని వెల్లడించారు.