మద్నూర్(జుక్కల్) : మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గేట్ వద్ద బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో జరుగుతున్న సంఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గురుకులంలో ఏం జరుగుతోంది..?
గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని శిరీష క్యాంపస్లోని వాటర్ట్యాంక్లో దూకి ఆత్మహత్యకు పాల్పడగా అక్టోబర్ 31న మరో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని వసుధ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందింది.
ఈ సంఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు గురుకుల కళాశాలలో ఏం జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపి విద్యార్థినుల క్షేమాన్ని పరిగణలోకి తీసుకుని పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.