Skip to main content

ప్రకృతి సేద్యంపై యూనివర్సిటీ

‘జర్మన్‌ ప్రభుత్వం, కేంద్రం సహకారంతో మనం ప్రకృతి వ్యవసాయంలో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.
University on Natural Irrigation
ఇండో–జర్మన్‌ గ్లోబల్‌ అకాడమీని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

తద్వారా ప్రకృతి సేద్యంలో Degree, Post Graduate Degreeతోపాటు Ph.Dలు కూడా అందిస్తాం. అప్పుడు ఇక్కడి నుంచి వచ్చే విద్యార్థులకు ప్రపంచం మొత్తం ఆహ్వానం పలుకుతుంది. ప్రపంచం మొత్తానికి ప్రకృతి సేద్యం అందుబాటులోకి వస్తుంది. అదే మన స్వప్నం. ఆ లక్ష్యంతోనే ప్రకృతి సేద్యంపై ప్రపంచ స్థాయి పరిశోధనకు ఇండో–జర్మన్‌ అకాడమి ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో ఇండో–జర్మన్‌ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమి (ఐజీజీఏఏఆర్‌ఎల్‌ –ఇండో – జర్మన్‌ గ్లోబల్‌ అకాడమి ఫర్‌ ఆగ్రో ఎకాలజీ రీసెర్చి అండ్‌ లెర్నింగ్‌.. ఐజీ గార్ల్‌) ఏర్పాటుకు జూలై 7న ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా న్యూటెక్‌ బయో సైన్సెస్‌కు శంకుస్థాపన చేశారు. ప్రకృతి వ్యవసాయ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో దేశ విదేశాల్లో విస్తరింపజేసే ఆశయంతో రూ.222 కోట్ల ఖర్చుతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..

చదవండి: దేశంలోనే తొలి ఆరోగ్య వర్సిటీ 24, 25వ స్నాతకోత్సవం

ఆర్బీకేల పాత్ర మరింత కీలకం

ఇకపై ఆర్బీకేలకు ప్రకృతి సేద్యాన్ని కూడా జత చేస్తున్నాం. ఇందుకు సంబంధించి తొలుత మనం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అన్ని ఆర్బీకేల్లో కచ్చితంగా ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన మాస్టర్‌ ట్రైనర్, సైంటిస్టు ఉండాలి. 


గ్రామంలో ఉన్న కమ్యూనిటీ రీసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీస్‌), అగ్రి సైంటిస్టు ఇద్దరూ కలిస్తే వారికున్న పరిజ్ఞానాన్ని గ్రామంలోని మిగిలిన రైతులకు అందించగలుగుతారు. ప్రకృతి సాగుకు కావాల్సిన ఉపకరణాలను కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) ద్వారా అందుబాటులో ఉంచుతారు. తద్వారా గ్రామాలను ప్రకృతి సాగు దిశగా నడిపించే ప్రయత్నం చేస్తాం. 


రసాయనాల వినియోగం తగ్గించి, ప్రకృతి సాగు వైపు వస్తే వెంటనే విపరీతమైన ఆదాయాలు వస్తాయని చెప్పలేం. ఆదాయాలు తొలుత తగ్గవచ్చు కూడా. అందుకే రైతుకు మూడు ఎకరాలు ఉంటే తొలి ఏడాది మూడవ వంతు మాత్రమే ప్రకృతి సాగు చేపట్టాలి. రెండవ ఏడాది 50 శాతం, మూడవ ఏడాది మొత్తం ప్రకృతి సాగువైపు మళ్లాలి. నాల్గవ సంవత్సరంలో ఫెస్టిసైడ్స్‌ వాడకపోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. భూమిలో సారం పెరగడం వల్ల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 

చదవండి: విద్యావ్యవస్థపై భారీ వ్యయం.. 9 రకాల కార్యక్రమాలు ఇవే..

ఎఫ్‌పీఓ సర్టిఫికేషన్‌ 

ఐజీజీఏఏఆర్‌ఎల్‌ ఏర్పాటు ద్వారానే ఇదంతా సాధ్యమవుతుంది. గ్రామ స్థాయిలో ఈ రకమైన శిక్షణ కోసం మనం ఈ అకాడమి ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఆరు లక్షల మంది మాత్రమే ప్రకృతి సాగులో మమేకమై ఉన్నారు. సుమారు కోటిన్నర ఎకరాల్లో కేవలం ఆరు లక్షల ఎకరాల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాగులో ఉంది. 


సహజ సాగు ఉత్పత్తులకు ఆర్బీకే స్థాయిలో సర్టిఫికేషన్‌ చేసే సౌలభ్యం అందుబాటులో ఉన్నప్పుడే మన ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తాయి. ప్రతి ఆర్బీకే పరిధిలో ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పీఓ) కనీసం ఒక్కటి ఉండేలా భవిష్యత్తులో అడుగులు వేస్తాం. ఒక్కసారి ప్రకృతి సాగు ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం మొదలైతే అప్పుడు రసాయనాల వాడకానికి రైతులు స్వస్తి చెబుతారు.

చదవండి: బాలికల హైస్కూలు ప్లస్‌గా 292 హైస్కూళ్లు

ఇదీ మన స్వప్నం

ఇది మనం ఆశిస్తున్న మార్పు, మనం కంటున్న కల. ఇవాళ మనం మొదటి అంకంలో ఉన్నాం. ఏడెనిమిది ఏళ్లలో అసాధారణమైన ఫలితాలను చూడవచ్చు. పులివెందులలో ఐజీ కార్ల్‌(ఏపీ కార్ల్‌) గా ఉన్న కాలేజీ ఐజీ గార్ల్‌గా ఇవాల్టి నుంచి మారిపోతోంది. త్వరలో ఒక యూనివర్సిటీగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడి నుంచి సహజ సాగులో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉంటుంది. 


జర్మన్‌ ప్రభుత్వం, కేంద్రంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలను కూడా భాగస్వాములను చేసి గొప్ప వ్యక్తులను తీసుకు రావాలన్న ప్రయత్నం జరుగుతోంది. దేవుడి దయవల్ల అది కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. 

ఇంతకు ముందు స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది.. ఈ రోజు పరిస్థితి ఎలా మారిందో మీరు చూడొచ్చు. (గతంలో స్కూల్‌ – పునర్‌ నిర్మాణం తర్వాత ఇప్పటి స్కూల్‌ ఫోటో చూపిస్తూ) మీరంతా బాగా చదివాలి. పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు ఏ మాదిరిగా చదువుతారో, మాట్లాడుతారో అదే మాదిరిగా గొప్పగా చదవాలి. గొప్పగా ఇంగ్లిష్‌ మాట్లాడాలి. ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలి. 
– వేంపల్లె విద్యార్థులతో సీఎం జగన్‌

మా స్కూలు చాలా బాగుంది

ఇప్పుడు మా స్కూళ్లు చాలా బాగున్నాయి. ఇదంతా మీ (సీఎం) వల్లే. అమ్మ ఒడి పథకం చాలా గొప్పగా ఉంది. గోరుముద్ద వల్ల మంచి భోజనం తింటున్నాం. మీరు లెజండరీ సీఎం. మీలాంటి సీఎం దొరకడం మా అదృష్టం. మీ అండతో మేము గ్లోబల్‌ స్టూడెంట్స్‌గా మారుతాం.

– శశికుమార్, జి.భానుశ్రీ, 10వ తరగతి, జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, వేంపల్లె

Published date : 08 Jul 2022 04:14PM

Photo Stories