Skip to main content

బోధన వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు

తెలంగాణ రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు నిర్ణీత కాలంలో పదోన్నతులు లభించనున్నాయి.
teaching doctors
బోధన వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు

గతంలో జారీ చేసిన జీవోను జాప్యం లేకుండా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అధ్యాపకుల వివరాలు పంపాలని కోరు తూ ఆయా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు డీఎంఈ రమేశ్‌రెడ్డి తాజాగా సర్క్యులర్‌ జారీచేశారు. గతంలో జీవో జారీ చేశాక అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకే పదోన్నతులు లభించాయని, అసో సియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదని బోధన ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఇటీవల ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో సర్క్యులర్‌ జారీ చేశారని ఆ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కిరణ్‌ మాదల తెలిపారు. సర్క్యులర్‌ ప్రకారం సంబంధిత పదోన్నతులకు అర్హ తున్న వారికి సంబంధించిన కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టులు పంపాలని డీఎంఈ కాలేజీల ప్రిన్సి పాళ్లు, సూపరింటెండెంట్లను కోరారు. ఎన్‌వోసీ, కేడర్‌ సేవల క్రమబద్ధీకరణ, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ కాపీలు పంపాలని కోరారు.

చదవండి: 

Published date : 08 Aug 2022 02:39PM

Photo Stories