Skip to main content

Telangana University: పీజీ పరీక్షలు ప్రారంభం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధి లో జ‌నవ‌రి 23న‌ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమైనట్లు కంట్రోలర్‌ ఎం అరుణ, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు.
Telangana University PG Exams start

 క్యాంపస్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని రిజిస్ట్రార్‌ ఎం యాదగిరి తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రిజిస్ట్రార్‌ వెంట ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ ఆరతి, అడిషనల్‌ కంట్రోలర్‌ సాయిలు ఉన్నారు.

కాగా ఉదయం జరిగిన 3వ సెమిస్టర్‌ పరీక్షకు 1,708 మంది విద్యార్థులకు 1,618 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 181 మంది విద్యార్థులకు 181 మంది హాజరయ్యారని కంట్రోలర్‌ తెలిపారు.

 

Published date : 24 Jan 2024 03:24PM

Photo Stories